హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపడుతున్న ప్యాకేజీ 9 పనుల పై జిల్లా కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే అక్టోబర్ నెలాఖరు నాటికి మిడ్ మానేరు జలాశయం నుండి అప్పర్ మానేరు జలాశయాంలోకి గోదావరి జలాలతో నింపుతామన్నారు. అప్పటిలోగా ప్యాకేజీ 9 సంబంధించి ప్రధాన కాలువల, డిస్ట్రిబ్యూషన్ కాలువల భూసేకరణ, కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. తద్వారా ప్యాకేజీ 9 ద్వారా 30 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు జలాలను అందించే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు. అలాగే జిల్లాలోని 666 చెరువులను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నింపేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm