ముంబై: నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబై, రత్నగిరి, రాయ్గఢ్, పాల్గఢ్, థానేలలో నేడు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిన్నఉదయం కురిసిన వర్షానికి దాదర్, మాతుంగా, వర్లినాకా, లాల్బాగ్, కింగ్స్ సర్కిల్, సియోన్, కుర్లా, అంధేరీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో జనజీవనం స్తంభించింది.
హింద్మాతా, గోల్డ్ ఈవల్ సహా మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మరోవైపు, పలు ప్రాంతాలో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై కూలడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నవాతావరణశాఖ హెచ్చరికలతో స్పందించిన ప్రభుత్వం అత్యవసర సేవల సిబ్బందిని అప్రమత్తం చేసింది. కాగా, నిన్న ఏకధాటిగా మూడు గంటలపాటు కురిసిన వర్షానికి 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 04,2020 07:59AM