హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే పాలకొలను నారాయణ రెడ్డి మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోరుమామిళ్ల మండలం అక్కల రెడ్డి పల్లె గ్రామానికి చెందిన ఆయన 1962లో మైదుకూరు నియోజకవర్గంలో స్వతంత్ర పార్టీ తరపున ఎమ్మెల్యే గెలిచారు. అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా నారాయణ రెడ్డికి పేరుంది. నారాయణ రెడ్డికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కాగా రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నారాయణ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. కాగా నారాయణ రెడ్డి మృతితో పలు పార్టీల నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మృతికి ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివరామకృష్ణా రావు, రాష్ట్ర మాజీ మహిళా ఆర్థిక చైర్ పర్సన్ క్రిష్ణమ్మ సంతాపం తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm