హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. తాజాగా ఏపీలోని మహిళ శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో 33 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆఫీస్ ను మూసేసి శానిటైజ్ చేస్తున్నారు. ఒకేరోజు 33 మంది ఉద్యోగులకు కరోనా సోకడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరులోని అమరావతి రోడ్డులో ఈ కార్యాలయం ఉన్నది. మొదట ఈ ఆఫీస్ లో పనిచేస్తున్న రాష్ట్ర డైరెక్టర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. తరువాత ఆఫీస్ లో పనిచేసే ఉద్యోగులకు కరోనా సోకింది. ఈ కార్యాలయంలో మొత్తం 120 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికి పరీక్షలు నిర్వహించగా అందులో 33 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ జరిగింది. దీంతో రాష్ట్రంలోని మిగతా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా కరోనా టెస్టులు నిర్వహించబోతున్నట్టు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm