హైదరాబాద్ : ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తా కొట్టింది. టైర్ బ్లాస్ట్ అవ్వడంతో బొలేరో వాహనం పల్టీ కొట్టింది. ఇందులో హెడ్ కానిస్టేబుల్ పాపయ్య మృతి చెందగా.. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ వారిని హయత్నగర్లోని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గచ్చిబౌలి నుంచి విజయవాడకి వెళ్తుండగా.. పెద్ద అంబర్పేట్ అవుటర్ రింగ్ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm