హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఒక్క రోజు వ్యవధిలోనే 1800కు పైగా కేసులు నమోదు కావడం... పరిస్థితి ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందటం లేదని బాధితులు గవర్నర్ కు తెలిపారు. నిన్న దాదాపు గంటన్నరసేపు నెటిజన్లతో గవర్నర్ సంభాషించారు. బాధితుల సాధకబాధకాలను తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కరోనా పరీక్షలు, చికిత్స, పేషెంట్ల బెడ్లు, ట్రీట్మెంట్ బిల్లులు, ప్రజలు తెలిపిన ఫిర్యాదులు తదితర అంశాలపై వారితో చర్చిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతోంది. గవర్నర్ తో భేటీ అయిన వారిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, కిమ్స్, కేర్ ఆసుపత్రి, అపోలో, విరించి, కామినేని, సన్ షైన్, గ్లోబల్, మల్లారెడ్డి నారాయణ, యశోద, కాంటినెంటల్ ఆసుపత్రుల ప్రతినిధులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm