హైదరాబాద్ : ఒడిశాలో కరోనా చాపకింద నీరులో వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా అక్కడ 571 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం తెలియజేసింది. దీంతో అక్కడ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,097కు చేరగా అందులో 3,557 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 6,486 మంది కరోనాతో కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 42 మంది కరోనాతో మరణించినట్లు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm