న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా అధికంగా ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ రష్యాను అధిగమించి మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రాల్లోనూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు తరువాత మరికొన్ని రాష్ట్రాలు కూడా కరోనా హాట్స్పాట్లుగా మారుతున్నాయి. ఒడిశా, పంజాబ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, గోవా తదితర రాష్ట్రాలు కరోనాకు కొత్త హాట్స్పాట్లుగా మారాయి. ఈ రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య ఒక్క నెలలో విపరీతంగా పెరిగింది. కరోనా కేసులను పంజాబ్, గోవా, జార్ఖండ్ రాష్ట్రాలు నియంత్రించినప్పటికీ, అన్లాక్ 2.0లో ఆంక్షల సడలింపు కారణంగా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో జూన్ 19- జూలై 2 మధ్య కరోనా పాజిటివ్ కేసుల రేటు ఐదు శాతానికి పైగా పెరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm