హైదరాబాద్: గుజరాత్లోని వలూజ్లో ఉన్న బజాజ్ ఆటో ఉత్పత్తి కంపెనీలో పనిచేస్తున్న 400 మంది వర్కర్లకు కరోనా వైరస్ సంక్రమించింది. దీంతో ఆ కంపెనీలో తాత్కాలికంగా ఆపరేషన్స్ నిలిపివేస్తున్నట్లు తెలిసింది. కోవిడ్19 కేసులు అత్యధిక సంఖ్యలో పెరిగాయని, వ్యాధి సంక్రమణ క్రమాన్ని ఆపాలంటే ప్లాంట్లో కొన్ని రోజుల పాటు పనులను నిలిపివేయాలని కార్మికుల సంఘం అధ్యక్షుడు తెన్గేడ్ బాజీరావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం తాత్కాలికంగా పనులను ఆపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm