అమరావతి : ఆంధ్రపదేశ్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందకు విధించిన లాక్డౌన్లో మద్యం షాపులు బంద్ అయ్యాయి. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల్లో తిరిగి తెరుచుకున్నాయి. కానీ మద్యం ధరలను ఏపీ ప్రభుత్వం భారీగా పెంచింది. దీంతో పక్క రాష్టాల నుంచి ఏపీకి భారీగా మద్యం అక్రమ రవాణా జరుగుతుంది. ఇటీవల పోలీసులు అనేక సార్లు అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. తాజాగా ఆర్టీసీ బస్సులో భారీగా మద్యం పట్టుబడింది. కృష్ణా జిల్లాలోని తిరువూరులోని బైపాస్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తిరువూరుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపుతోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm