గాంధీనగర్ : గుజరాత్ రాష్ట్రంలోని పల్లు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి, దేవ్భూమి ద్వారకా జిల్లాలోని ఖంభాలియా తహసీల్లో సోమవారం 71 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సౌరాష్ట్ర ప్రాంతంలోని పోర్బందర్, గిర్ సోమనాథ్, జునాగ, అమ్రేలి జిల్లాలతో పాటు దక్షిణ గుజరాత్లోని వల్సాద్, నవసరి జిల్లాల్లో రోజంతా వర్షాలు కురిశాయి. ద్వారకా నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. వచ్చే మూడు రోజుల్లో సౌరాష్ట్ర, ఉత్తర, దక్షిణ గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం తెలియజేసింది.
Mon Jan 19, 2015 06:51 pm