హైదరాబాద్ : కోవిడ్ బారిన పడ్డ జర్నలిస్టులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కరోనా వైరస్ సోకిన జర్నలిస్టులకు రూ.50,000 నుంచి లక్ష వరకు ఆర్థిక సహాయం అందజేయాలని సెంట్రల్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటనను విడుదల చేసింది. కరోనా బారిన పడి చికిత్స పొంది డిశ్చార్జి అయిన జర్నలిస్టులు ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అందుకు సంబంధించిన ప్రత్యేక యాప్ను విడుదల చేసింది. జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. అలాగే కోవిడ్ బారిన పడి మృతి చెందిన జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందని, దీనికి సంబంధించిన వివరాలను ఆ యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని చెప్పింది.
Mon Jan 19, 2015 06:51 pm