అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,178 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఏపీలో 1,155 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన 22 మందికి, విదేశాల నుంచి ఏపీకి వచ్చిన మరో వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,197కు చేరింది. ప్రస్తుతం 11200 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకొని 9,745 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక రోజు వ్యవధిలో కరోనా వల్ల 13 మంది చనిపోయారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 252కు పెరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm