హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేవంటూ రోగులు పలుమార్లు వీడియోలు బయటకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా సోకిన వ్యక్తి అర్ధరాత్రి హల్ చల్ చేసాడు. పీపీఈ కిట్ ధరించి ఇంటికి వెళ్తానంటూ బ్యాగు తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రి నుండి బయటకు వచ్చాడు. అది గమనించిన పోలీసులు అతడికి నచ్చజేప్పే ప్రయత్నం చేసినప్పటికి రోగి బయట వరకు వచ్చాడు. పోలీసులు ఎలాగోలా అతడిని బుజ్జగించి మళ్లీ ఆస్పత్రి లోపలికి పంపించారు.