హైదరాబాద్ : ఏపీలోని పింఛన్ దారులకు గుడ్న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. ఆగష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్షన్ మొత్తం పెరగనుంది. ప్రస్తుతం పెన్షన్ దారులకు నెలకు రూ.2,250 పింఛను వస్తుంది. వచ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయలు అందనుంది. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు ఈ పెన్షన్ని గ్రామ, వార్డు వాలంటీర్లు అందజేస్తారు. తాము అధికారంలోకి వస్తే పింఛను సొమ్మును ఏడాదికి రూ.250 చొప్పున పెంచుకుంటూ వెళ్తామని.. వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ క్రమంలో ఆగష్టు నుంచి పెన్షన్ మొత్తం పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ నెల 15న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఆ రోజున ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయం ఒకటో బ్లాక్లో మంత్రి మండలి భేటీ జరగనుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు, కరోనా నియంత్రణ చర్యలపై సహా పలు అంశాలపై చర్చించి మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలను రెడీ చేయాలని సంబంధిత అధికారులకు సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. జూలై 13 సాయంత్రం 5 గంటలలోపు ప్రతిపాదనలు సిద్ధంగా ఉండాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm