హైదరాబాద్ : మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. దేశం మొత్తంలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదైంది ఈ రాష్ట్రంలోనే. మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. వారిలో లక్షకు పైగా బాధితులు కోలుకున్నారు. అంతే కాకుండా 9,448 మంది కరోనాతో మరణించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న పూణే, పింప్రి చిన్చ్వాడ్ ప్రాంతాల్లో కఠినమైన లాక్డౌన్ ను అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జులై 13 నుండి 23 వరకు 10రోజులు కఠినమైన లాక్ డౌన్ ను అమలు చేస్తునట్టు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ రోజు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో అత్యవసర సేవలు తప్ప మిగిలిన సేవలన్నీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఇదివరకు విధించిన లాక్ డౌన్ తో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకొంటున్న ప్రజలు మరోసారి లాక్ డౌన్ ప్రకటనతో ఆందోళన చెందుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm