హైదరాబాద్: సచివాలయంలో ఉన్న మసీదు, నల్లపోచమ్మ దేవాలయాన్ని కూలగొట్టిన సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్కుమార్కు బేడీలు వేయాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరిని చర్లపల్లి జైల్లో పెట్టాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. దేవాలయం కూల్చివేతపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్ స్పందించాలన్నారు. తెలంగాణ ఉద్యమానికి వేదికైన నల్లపోచమ్మ దేవాలయం, మసీదులను అమానుషంగా కూల్చటాన్ని ఖండిస్తున్నామన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా సీఎస్ సోమేష్ కుమార్ పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm