న్యూఢిల్లీ: సుమారు రూ.1.5 కోట్ల విలువైన సిగరెట్లను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, ఢిల్లీ మధ్య నడిచే ప్రత్యేక రైలులో భారీగా సిగరెట్లను రవాణా చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఢిల్లీ రైల్వే స్టేషన్కు ఆ రైలు చేరగానే అందులో తనిఖీ చేశారు. వంద పెట్టెల్లో ప్యాక్ చేసిన రూ.1.2 కోట్ల విలువైన పది లక్షల సిగరెట్లతోపాటు మరో 38 బ్యాగుల్లో ఉంచిన రూ.36 లక్షల విలువైన 9 లక్షల సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి ఒకరిని అరెస్ట్ చేశారు. భారీగా సిగరెట్ల తరలింపుపై ఢిల్లీ కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm