హైదరాబాద్ : దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. తాజాగా నాగాలాండ్లో 36 కొత్త కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వాటిలో పెరెన్లో 19, డిమాపూర్లో 11, కొహిమాలో 6 కేసులు పాజిటివ్గా నమోదైయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో నాగాలాండ్లో మొత్తం కేసుల సంఖ్య 732కు చేరింది. కాగా భారత్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,802 చేరి ఎనిమిది లక్షలకు చేరువలో ఉంది. వీటిలో 2,76,682 మంది కరోనా బారినపడి చికిత్స పొందుతుండగా.. 4,95,516 మంది కరోనా నుంచి కోలుకొని రికవరీ అయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm