కాన్పూర్: ఈ ఉదయం ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ వికాస్ దూబే అనుచరుడికి చెందిన రేషన్ షాపు నుంచి కాన్పూర్ పోలీసులు ఏడు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. వికాస్ దూబే అనుచరుడైన దయాశంకర్ అగ్నిహోత్రికి చౌబేపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బిక్రు గ్రామంలో ప్రభుత్వ రేషన్ దుకాణం ఉంది. అతని రేషన్ దుకాణం నుంచి ఏడు నాటు బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జూలై 2న వికాస్ దూబేను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై అతని గ్యాంగ్ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతిచెందారు. అనంతరం పరారీలో గ్యాంగ్ సభ్యుల కోసం గాలింపులు చేపట్టిన యూపీ పోలీసులు బుధవారం ఒకరిని, గురువారం ఒకరిని ఎన్కౌంటర్ చేశారు. మరో నలుగురిని అరెస్ట్ చేశారు. గురువారం మధ్యప్రదేశ్లో అరెస్టయిన ప్రధాన నిందితుడు దూబే ఈ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 10,2020 06:52PM