చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 3,680 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ ప్రకటించింది. కరోనా వల్ల ఒక్కరోజే 64 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,261కు చేరింది. ప్రస్తుతం 46,105 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 82,324 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 1,829కు పెరిగింది. చెన్నైలోనే ఎక్కువ మందికి కరోనా సోకింది.
Mon Jan 19, 2015 06:51 pm