హైదరాబాద్ : ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలపై , ఆర్థిక మంత్రి హరీశ్ రావు, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం పదిన్నర గంటల నుంచి సాయింత్రం వరకు ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..త్వరలో మున్సిపాల్టీల్లో ఉద్యోగాల ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని అన్నారు. ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని త్వరలో నియామకాలు కూడా చేపడతామని అన్నారు. రాష్ట్రంలోని పట్ణణాలు ప్రణాలికాబద్దంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 42 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఓ అభివృద్ధి నమూనా పట్టికను తయారు చేశామన్నారు. అందులో ఆదర్శమున్సిపాలిటీగా మారాలంటే ఉండాల్సిన అభివృద్ధి, అవసరమైన పనులు, హంగులు ఉన్నాయని తెలిపారు. ఆగష్టు 15వ తేదీలోగా అన్ని మున్సిపాల్టీల్లో ప్రతీ వెయ్యి మందికి ఒక టాయిలెట్ ఉండేలా లక్ష్యంతో పని చేయాలన్నారు. ఇందులో 50 శాతం షీ టాయిలెట్లు సైతం ఉండాలన్నారు. 400 పాత బస్సులను తీసుకొని మహిళల కోసం పట్టణాల్లో షీ టాయిలెట్లుగా అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ప్రతీ మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్ ఉదయం 5.30 గంటలకే ఫీల్డ్ లో ఉండాలని ఆదేశించారు. బయోలాజికల్ వెస్టేజ్, బయో మెడికల్ వేస్టేజ్, కన్స్ట్రక్షన్ అండ్ డెమాలీష్ వెస్టేజ్ నిర్వహణ చేపట్టాలన్నారు. కుక్కల బారినుండి ప్రజలను కాపాడేందుకు యానిమల్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm