హైదరాబాద్: ప్రముఖ కూచిపూడి నాట్యగురువు శ్రీ మునుకుంట్ల సాంబశివ కరోనా తో పోరాడుతూ శుక్రవారం కన్ను మూశారు. నాట్యం తోపాటు, హస్తాభినయం పై ఆయన అనేక పరిశోధనలు చేశారు. కోఠి ఇసామియా బజార్ లో నిషుశీభిత నాట్య జ్ఞాన్ పీఠ్ పేరిట నాట్యాలయం ఏర్పాటు చేసి ఎంతో మందిని తీర్చిదిద్దారు. కూచిపూడి నాట్యానికి జీవితాన్ని అంకితం చేశారు. ఆయన రాసిన హస్తాభినయం గ్రంథం విశేష ప్రాచుర్యం పొందింది. ఇంకొన్ని మార్పులు చేసి శ్రీ హస్తాభినయం పేరిట ప్రచురించిన గ్రంథం యూనివర్సిటీ లలో చదివే నాట్య విద్యార్థులకు పరిశోధకులకు ఉపయోగపడుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, బెంగళూరు, పుణె, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో జరిగిన పలు సదస్సుల్లో పాల్గొని తన పరిశోధన ప్రత్యేకతను చాటుకున్నారు. సాంబశివ లేని లోటు నాట్య రంగం లో తీరనిది. ప్రస్తుతం వారి భార్య, కుమార్తె కూడా కరోనా తో పోరాడుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm