అమరావతి: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. కరోనా సంక్షోభ సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. కాగా.. ఏపీలో ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ బదిలీ అయ్యారు. ఆయనను ఏపీఎస్పి బెటాలియన్ అడిషనల్ డిజి గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు ఆర్టీసీ ఎండీ గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సిఎస్ నీలం సాహ్నీ ఉత్తర్వులు జారీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm