హైదరాబాద్: కరోనా వచ్చి మనిషిలో ఉన్న కొద్దిపాటి మానవత్వాన్ని చంపేసింది. పబ్లిక్ ప్లేస్ లో ఒంట్లో బాగోలేనట్టుగా కనిపించినా, దగ్గినా లేదంటే తుమ్మినా అనుమానంగా చూస్తున్నారు. అలాంటి వాళ్ళను నిర్ధాక్షిణ్యంగా తరిమేస్తున్నారు. కరోనా లక్షణాలు లేవని చెప్పినా వినకుండా ఓ యువతిని బస్సులో నుంచి బలవంతంగా బయటకు తోసేశారు. రోడ్డుమీద పడ్డ ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి అన్సిక యాదవ్ అనే యువతి తన తల్లితో కలిసి యూపీలోని శికోహాబాద్ వెళ్లేందుకు బస్సు ఎక్కారు. బస్సు ఢిల్లీ నుంచి యమునా ఎక్స్ ప్రెస్ హైవే మీద వెళ్తుండగా యువతితో కరోనా లక్షణాలు ఉన్నాయని కొంతమంది ప్రయాణికులు గుర్తించారు. వెంటనే బస్సు ఆపేయాలని ప్రయాణికులు పట్టుబట్టారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, తాను బాగానే ఉన్నానని చెప్పినా ప్రయాణికులు వినలేదు. బస్సు డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులు ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఒత్తిడితో బస్సు డ్రైవర్ ఆ యువతిని బలవంతంగా బస్సులో నుంచి బయటకు తోసేశాడు. దీంతో ఆ యువతికి గాయాలయ్యాయి. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మరణించింది. యువతి మరణానికి సంబంధించిన కేసును పోలీసులు ప్రసుత్తం దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm