హైదరాబాద్ : నెల్లూరు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు, ఆర్టీసీ ఉద్యోగులు ఇలా అందరూ కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆత్మకూరుకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్కు కరోనా నిర్ధారణ అయింది. అతడు విజయవాడ- నెల్లూరు రూట్లలో తిరిగినట్లు ఆర్టీసీ అధికారులు గుర్తించారు. అటు డ్రైవర్ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులకు వైరస్ సోకడంతో అధికారులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక మరో 35 మంది హోం క్వారంటైన్లో ఉన్నారు. కాగా, నెల్లూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 76 పాజిటివ్ కేసులు, రెండు మరణాలు సంభవించాయి. దీనితో ఇప్పటివరకు అక్కడ 1031 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 450 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అటు 9 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. ఇక 572 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm