బెంగళూరు: కర్ణాటకలోని బిదడిలో ఉన్న టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో మరో నలుగురు ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. ఫలితంగా ఈ ప్లాంట్లో కరోనా బారినపడిన ఉద్యోగుల సంఖ్య 18కి పెరిగింది. ఇటీవల 14 మంది ఉద్యోగులు ఈ మహమ్మారి బారినపడ్డారు. తాజాగా కరోనా బారినపడి ఉద్యోగులు చివరిసారి గత నెల 29, ఈ నెల 2, 3 తేదీలలో విధులకు హాజరైనట్టు టీకేఎం తెలిపింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కరోనా బాధితుల ప్రైమరీ, సెంకడరీ కాంటాక్టులను క్వారంటైన్ చేసినట్టు పేర్కొంది. బాధిత ఉద్యోగుల చికిత్స సమయంలో వారికి పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm