హైదరాబాద్ : సిలికాన్ సిటీ బెంగళూరులో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ని విధించనున్నారు. ఈ నెల 14 నుంచి వారం రోజుల పాటు బెంగళూరు నగరంలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప వెల్లడించారు. బెంగళూరు సిటీ, బెంగళూరు రూరల్ ప్రాంతాల్లోఈ నెల 14 రాత్రి గం. 8.00 నుంచి - జులై 22 ఉదయం గం. 5.00 వరకు సంపూర్ణ లాక్డౌన్ ఉండనుందని ఆయన అన్నారు. ఈ సమయంలో కేవలం అత్యవసర వస్తువుల దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసిన ప్రభుత్వం అందులో.. ఆసుపత్రులు, నిత్యావసర సరకుల దుకాణాలు, పండ్లు, కూరగాయల మార్కెట్లు మాత్రమే తెరిచి ఉంటాయి. మెడికల్, పీజీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి అని వెల్లడించింది. కాగా ఈ నెల ప్రారంభం నుంచి బెంగళూరులో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రోజు అక్కడ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm