వరంగల్ : జిల్లాలోని ఎంజీఎం కోవిడ్ వార్డులో దారుణం చోటు చేసుకుంది. అధికారులు పరిశుభ్రత మరిచారు. కరోనా పాజిటివ్ వార్డులోని బాత్రూమ్లో నీళ్లు నిలిచిపోయాయి. రెండ్రోజులుగా బాత్రూమ్స్ క్లిన్ చేయకుండా ఎంజీఎం సిబ్బంది అలానే వదిలేసింది. దీంతో వార్డులోని కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 మంది రోగులను ఓకే హాల్లోనే అధికారులు పెట్టారు. అంతేకాదు.. వారందరికీ రెండు బాత్రూమ్లో ఉండటం గమనార్హం. కరోనా నివారణ కావాలంటే పరిశుభ్రం ముఖ్యం. ఈ విషయం చెప్పాల్సిన అధికారులు, వైద్యులే పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. తమకు మంచి సౌకర్యాలు కల్పించాలని వార్డులోని రోగులు ఆందోళనకి దిగారు.
Mon Jan 19, 2015 06:51 pm