హైదరాబాద్: నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలు సరైన సమయానికే చేరుకొని, దేశమంతటా విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు అక్కడక్కడ తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు మీడియాకు వెల్లడించారు. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకూ ఉత్తర-దక్షిణ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm