హైదరాబాద్: ఉజ్జయనీ మహంకాళి బోనాల సందర్భంగా లష్కర్ ప్రాంతంలో ఒక రోజు మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. నార్త్జోన్లోని గోపాలపురం, చిలకలగూడ, లాలాగూడ, తుకారాంగేట్, మహంకాళి, మార్కెట్, మారేడ్పల్లి, కార్ఖానా, బేగంపేట్, తిరుమలగిరి, సెంట్రల్ జోన్ పరిధిలోని రాంగోపాల్పేట్, గాంధీనగర్ పోలీస్టేషన్ల పరిధుల్లో ఉండే అన్ని మద్యం దుకాణాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు. నేటి ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం(13) ఉదయం 6 గంటల వరకు 24 గంటలు అన్ని మద్యం దుకాణాలు మూసి వేయాలని ఆదేశాలు జారీచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm