ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 113 మందికి పాజిటివ్గా నిర్దారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నమోదయిన కేసులతో కలిపితే జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1522కు చేరుకుంది. ఆదివారం నాడు ఒంగోలులో 15, కందుకూరు 15, మార్కాపురం 11, పామూరులో 9 మందితో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యింది. జిల్లాలో ఇప్పటి వరకు 24 మంది మృతి చెందారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 99,902 శ్యాంపిల్స్ ల్యాబ్కు పంపడం జరిగింది. 94,793 మందికి నెగిటివ్ రాగా.. ఇంకా 3710 మంది రిపోర్ట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 896 మంది క్వారంటైన్లలో ఉన్నారు. నిన్న ఒక్కరోజే 66 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా బారి నుంచి కోలుకుని మొత్తం 869 మంది డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 653 గా ఉందని వైద్యాధికారులు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm