నిజామాబాద్: నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యాపారస్తుల కుటుంబ సభ్యులకు కరోనా వచ్చినందున కార్యకలాపాలు నిలిపివేయాలని నిజామాబాద్ మ ర్చంట్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ వి షయంపై కలెక్టర్కు శనివారం సంఘం తరఫున వి నతిపత్రం అందించారు. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఈనెల 13 నుంచి 20 వరకు కార్యకలాపాలను స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్ దాల్వియా, ప్రధాన కార్యదర్శి బచ్చు పురుషోత్తం గుప్త, కోశాధికారి సంతోష్కుమార్ గుప్త వినతిపత్రంలో కలెక్టర్కు విన్నవించారు. వ్యాప్తి ఎక్కువగా ఉండడం, గుమస్తాలతో పాటు రైతులు వస్తుండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm