హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఆదివారం ఉదయం తన సిబ్బందితో ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. కరోనా బాధితులకు వైద్యం ఎలా అందిస్తున్నారు..? వార్డుల్లో వసతులు ఎలా ఉన్నాయ్..? నిశితంగా పరిశీలించారు. అనంతరం గాంధీ సూపరింటెండెంట్, ఆసుపత్రి సిబ్బందితో కిషన్ రెడ్డి మాట్లాడారు. కాగా గత రెండు మూడ్రోజులుగా ఆయన కోవిడ్-19 బాధితులున్న ఆస్పత్రులను సందర్శిస్తున్నారు. కాగా.. తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే పెరిగిపోతోంది. టెస్ట్లు సక్రమంగా చేయట్లేదని.. ఎక్కువ సంఖ్యలో కూడా చేయట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం టెస్ట్ల సంఖ్య పెంచాలని.. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందని మీడియా ముందు వెల్లడించిన విషయం విదితమే.
Mon Jan 19, 2015 06:51 pm