లక్నో: భారత క్రికెట్ జట్టు మాజీ టెస్ట్ ఆటగాడు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మంత్రి చేతన్ చౌహాన్కు కరోనా సోకినట్లు గుర్తించారు. కోవిడ్ -19 లక్షణాలు కనిపించడంతో మంత్రి ఆరోగ్య పరీక్షల కోసం హజ్రత్గంజ్లోని శ్యామా ప్రసాద్ ముఖ్జీర్ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ ట్రూనెట్ పరీక్షలో అతనికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఈ నేపధ్యంలో చేతన్ చౌహాన్... సంజయ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీజీఐ)కి చెందిన కోవిడ్ ఆసుపత్రిలో చేరినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర అగర్వాల్ తెలిపారు. చౌహాన్ కుటుంబ సభ్యులకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా యూపీ రాజధాని లక్నోలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 202 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్- 19 బాధితుల సంఖ్య 35 వేలు దాటింది.
Mon Jan 19, 2015 06:51 pm