మంచిర్యాల: జిల్లాలోని హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. ఆఫీసులో ఓ అధికారికి కరోనా సోకింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా కార్యాలయం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరో ఐదు రోజుల పాటు కార్యాలయం మూసి ఉంటుందని.. అధికారులంతా సెలవులో ఉంటారని ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం కార్యాలయం మొత్తం శానిటైజన్ చేయనున్నారు. కాగా.. జిల్లాలో శనివారం నాడు మంచిర్యాల జిల్లాలో 05 కరోనా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm