హైదరాబాద్: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. బయటకి వస్తే కరోనా ఎక్కడ సోకుతుందేమోనన్న భయంతో సెలబ్రిటీలు షూటింగ్లు చేయడం కూడా మానేశారు. అయితే కొందరు మాత్రం తప్పని పరిస్థితులలో షూటింగులకి హాజరవుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులని దృష్టిలో పెట్టుకున్న ఓ నిర్మాత చిత్ర బృందానికి భీమా చేయించాలని భావిస్తున్నాడట. తాప్సి హీరోయిన్ గా రూపొందబోతున్న లూప్ లపేటా చిత్రం మరి కొద్ది రోజులలో సెట్స్ పైకి వెళ్లనుంది. షూటింగ్ మొదలైన తర్వాత ఎవరైన కరోనా బారిన పడితే ఇబ్బందని తెలుసుకున్న చిత్ర నిర్మాత అందరికి భీమా చేయించాడట. ఇండియాలో ఇలాంటి భీమా తీసుకున్న మొదటి సినిమాగా లూప్ లపేట రికార్డు సాధించింది. మరి ఈ నిర్మాత బాటలోనే ఇతర వెళతారా లేదా అనేది చూడాలి.
Mon Jan 19, 2015 06:51 pm