ముంబై : మహారాష్ర్టలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఆ రాష్ర్ట ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాజాగా మహారాష్ర్ట గవర్నర్ నివాసానికి కరోనా తాకింది. రాజ్ భవన్ లో పని చేసే ఉద్యోగుల్లో 16 మందికి శనివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం 100 మందికి కొవిడ్ టెస్టులు చేయగా.. అందులో 55 మందికి ఫలితాలు రాగా, 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. త్వరలోనే గవర్నర్ కూడా కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు. మహారాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,46,600 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10,116 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 99,902 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 1,36,985 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm