హైదరాబాద్: నగరంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరిగిపోతోంది. తాజాగా కూకట్పల్లి ఆర్టీసీ డిపోలో పార్కింగ్ డ్రైవర్గా పనిచేస్తున్న మొయిన్ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అతని కుటుంబసభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. అయితే డిపోలో ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదైనా అధికారులు ఎలాంటి శానిటైజేషన్ చేయలేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిపో డీఎమ్ స్వామికి కూడా కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్లో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm