ఏలూరు: పశ్చిమ గోదావరికి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ విప్ అంగర రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ సర్కారు బీసీలపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆరోపించారు. ''టీడీపీకి బీసీలను దూరం చేయాలనేదే జగన్ లక్ష్యం. దానిలో భాగంగానే మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పితాని కుమారుడుపై కేసులు పెట్టారు. బీసీల్లో బలమైన నేత పితాని సత్యనారాయణను వైసీపీలో చేర్చుకోవడానికి ఆయన కుటుంబ సభ్యులపై విషయమై కేసులు పెడుతున్నారు. జగన్ సర్కారుకు పతనం మొదలైంది. టీడీపీ నుంచి బీసీలను ఎవరూ వేరు చేయలేరు. మాజీ మంత్రి, సీనియర్ నేత శిద్ధా రాఘవరావు మైనింగ్పై అక్రమ కేసులు బనాయించి, ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారు. ఆయనలాగే పలువురు సీనియర్ నేతలను కూడా పార్టీలోకి చేర్చుకోవడానికి జగన్ ఇలా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు'' అని ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm