హైదరాబాద్: భక్తులతో కిటకిటలాడుతూ జరగాల్సిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు కళతప్పాయి. కరోనా ప్రభావంతో భక్తులు ఇళ్లోనే బోనాలు సమర్పించుకుంటున్నారు. ఆలయ అధికారులు పండితుల సమక్షంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు నిర్వహిస్తున్నారు. మొదటగా గోల్కొండలో బోనాల పండుగ మొదలవుతుంది. తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్ అన్ని ప్రాంతాల్లో జరుగుతుంటాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో ఆదివారం ఉదయం ఆషాఢ బోనాలు ప్రారంభమయ్యాయి. అయితే భక్తులు లేకుండా అధికారులు, అర్చకుల సమక్షంలో మాత్రమే ఆలయంలో బోనాల జాతర జరుగుతుండటం చరిత్రలో ఇదే మొదటిసారి. కరోనా నేపథ్యంలో అధికారుల ఆదేశాల మేరకు భక్తులందరూ ఇళ్లలోనే బోనాలు జరుపుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm