విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనుల్లో మతలబులు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే షాపింగ్ కాంప్లెక్స్ పేరుతో రూ. 65 లక్షలు గోల్మాల్ చేయగా.. తాజాగా మరో రూ. 3కోట్లు అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదనపు లిఫ్ట్ ఛాంబర్ల పేరిట రూ. 2.22కోట్లు, ఫుట్పాత్ నిర్మాణం పనులకు సంబంధించి అవకతవకలు జరిగాయి. అయితే అధికారులు మాత్రం ఎప్పుడో జరిగిన పనులకు సంబంధించి క్లోజింగ్ ఆర్డర్లు మాత్రమే ఇచ్చామని చెబుతున్నారు. ఇటీవలె కనకదుర్గానగర్లో షాపింగ్ కాంఫ్లెక్స్ నిర్మాణం పేరుతో రూ. 65 లక్షలు మంజూరు చేశారు. తీరా ఆ ప్రాంతంలో ఎక్కడా షాపింగ్ మాల్ లేదంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకువచ్చింది. తాజాగా మరో రూ. 3కోట్ల పనులకు సంబంధించిన ఆదేశాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Mon Jan 19, 2015 06:51 pm