హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి సహా వివిధ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్న ఔట్సోర్సింగ్ నర్సులు ఆందోళనకు దిగారు. తమను రెగ్యులరైజ్ చేయాలని. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ దీనిపై డీఎంఈ కార్యాలయంలో అధికారిని కలిసి మాట్లాడామన్నారు. కొత్తగా వచ్చినవాళ్లకు రూ. 29 వేలు ఇస్తున్నారని, 14 ఏళ్లుగా చేస్తున్న తమకు రూ. 15వేలు మాత్రమే ఇస్తున్నారని, తమకు ఇంక్రీమెంట్స్ ఇవ్వాలని కోరామన్నారు. మమ్మల్ని ఇంతవరకు పర్మినెంట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో తాము రేయింబవళ్లు సేవలు అందిస్తున్నామని చెప్పారు. తమకు న్యాయం జరగాలని జీతాలు పెంచి, రెగ్యులరైజ్ చేయాలని నర్సులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm