జనగామ: జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్ గ్రామంలోని డబుల్ బెడ్ ఇళ్ళలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి వచ్చారు. కొత్తగా కనిపించే సరికి వారిలో ఒకరిని పట్టుకొన్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. మిగిలిన ఒకరు తప్పించుకొని పారిపోతుండగా ఓ వ్యక్తి జాతీయ రహదారి పక్కన ఉన్న బావిలో పడి మృతి చెందాడు. గ్రామస్తులు సహకారంతో బావిలో నుండి మృతదేహాన్ని బయటికి తీసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడు హైదరాబాద్కు చెందిన ఉమర్గా గుర్తించారు. సెటాప్ బాక్సుల చోరీ కోసం వచ్చి తప్పించుకు పారిపోయే క్రమంలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm