అమరావతి: బాధితులను పరామర్శించడానికి వెళ్లిన నేతలను అరెస్ట్ చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. పోలీసుల చర్య దారుణం అన్నారు. విశాఖ రాంకీ ఫార్మా కంపెనీ పేలుడు ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులపై రామకృష్ణ తీవ్రంగా స్పందించారు. అరెస్టులను దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. అరెస్ట్ చేసిన నేతలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm