జైపూర్ : రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పూటపూటకు రాజకీయాలు మారుతున్నాయి. సచిన్ పైలట్ కు మద్దతుగా పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు ప్రకటించారు. మరోవైపు, ఎల్లుండి మంత్రివర్గవిస్తరణ చేపట్టేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ కసరత్తు చేస్తున్నారు. సీఎం అశోక్ గెహ్లాట్ కు వ్యతిరేకంగా గళమెత్తిన సచిన్ పైలట్ ను డిప్యూటీ సీఎం పదవి నుంచి, అలాగే రాజస్థాన్ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కాంగ్రెస్ అధిష్టానం తొలగించింది. అలాగే, సచిన్ పైలట్ కు మద్దతుగా నిలిచిన మంత్రులు విశ్వేంద్ర సింగ్, రమేశ్ మీనాలపై కూడా వేటువేశారు. సచిన్ పైలట్ స్థానంలో గోవింద్ సింగ్ ను పార్టీ నియమించింది. మరో ఎమ్మెల్యే గణేశ్ గోగ్రాను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రదేశ్ సేవాదళ్ అధ్యక్షుడిగా హేం సింగ్ షెకావత్ ను నియమించారు.
Mon Jan 19, 2015 06:51 pm