ఏలూరు: స్పీకర్ తమ్మినేని సీతారామ్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. ఆకివీడు మండలం కాళింగగూడెంలో మాజీ ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు ఎక్కడా కూడా భౌతిక దూరం పాటించలేదు. పోలీసులు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm