వికారాబాద్: జిల్లా పరిగిలో భారీ వర్షం కురిసింది. దీంతో పరిగి పట్టణంలోని బీసీ కాలనీలోని వీధుల్లో నీళ్లు నదిలా ప్రవహిస్తున్నాయి. బీసీ కాలనీలోని పలు ఇళ్లలోకి నీళ్లు చేరాయి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వినవస్తున్నాయి. కాలనీల్లోకి నీళ్లు చేరాయన్న విషయం మున్సిపల్ అధికారులకు తెలిసినప్పటికీ ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మళ్లీ కాలనీల్లో నీళ్లు రాకుండా చూడాలని కోరుతున్నారు. పరిగి సమీపంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్, పరిగిలో రాకపోకలు నిలిచిపోయాయి నీళ్లల్లో పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
Mon Jan 19, 2015 06:51 pm