హైదరాబాద్: ఉత్తరాఖండ్ లో దారుణం చోటుచేసుకుంది. డెహ్రాడూన్లోని చుక్కువాలా ప్రాంతంలో భారీ వర్షాలకు ఒక భవనం కూలింది. ఎస్డిఆర్ఎఫ్ బృందం ఇప్పటివరకు ఆరుగురిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చారు. వారిలో ముగ్గురు అప్పటికే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శిధిలాల కింద ఇంకా పలువురు ఉన్నారని తెలుస్తోంది. వారిని బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. భారీ వర్షాలకు రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో 54 రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm