హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. కొవిడ్-19 పాజిటివ్ల జాబితాలో ప్రపంచంలోనే భారత్ మూడోస్థానంలో ఉంది. కేసుల సంఖ్య 9 లక్షలను దాటింది. వ్యాక్సిన్, ఔషధం వచ్చేదాకా.. ఈ మహమ్మారిని కట్టడి చేయాలంటే లాక్డౌన్ ఒక్కటే మార్గమని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి. కేంద్రం ఈ నెల నుంచి ‘అన్లాక్ 2.0’ ప్రకటించినా.. లాక్డౌన్ విధింపే ఉత్తమమంటున్నాయి. గతంలో విధించిన విడతల వారీ లాక్డౌన్ల కారణంగా.. కరోనా వ్యాప్తిని 2 నెలల పాటు అడ్డుకోగలిగామని, ఇప్పుడూ అదే నిర్ణయం ఉత్తమమని అభిప్రాయపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు నగరాల వరకైనా లాక్డౌన్ను అమలు చేసి, వైర్సను కట్టడి చేయాలని నిర్ణయించాయి.
కర్ణాటక: బెంగళూరు నగరంలో వారంపాటు కఠిన లాక్డౌన్ను విధించింది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచే లాక్డౌన్ అమల్లోకి రాగా.. 22వ తేదీ వరకు కొనసాగనుంది. తాజా లాక్డౌన్ ప్రకటనతో సోమవారం ఉదయం నుంచి వేల సంఖ్యలో వలస కూలీలు బెంగళూరును వీడారు. నేలమంగళ టోల్గేట్ నుంచి 25వేల మంది, ఎలకా్ట్రనిక్ సిటీ టోల్ గేట్ మీదుగా 8 వేల మంది వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. ధర్వాడ, దక్షిణ కర్ణాటక జిల్లాల యంత్రాంగాలు కూడా బుధవారం నుంచి 9 రోజులపాటు లాక్డౌన్ను ప్రకటించాయి.
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్లో కరోనా కట్టడికి వారాంతాల్లో లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 39 వేలకు పైగా ఉంది. దీంతో.. యోగి సర్కారు వారాంతాల్లో కర్ఫ్యూ, లాక్డౌన్ను కొనసాగిస్తోంది.
బిహార్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బిహార్ సర్కారు కూడా లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 నుంచి 31 వరకు దీన్ని అమలు చేయనుంది. ప్రధానంగా వలస కార్మికులు తిరిగి రావడంతో.. రాష్ట్రంలో కరోనా పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. కాగా.. పట్నాలోని బిహార్ బీజేపీ ప్రధాన కార్యాలయంలో.. 75 మంది నాయకులు, పార్టీ ఆఫీస్ బేరర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
తమిళనాడు: దేశంలో కరోనా కేసుల్లో మహారాష్ట్ర తర్వాతి స్థానాన్ని తమిళనాడు ఆక్రమించింది. ఆ రాష్ట్రంలో సుమారు లక్షన్నర కేసులు నమోదయ్యాయి. దీంతో.. ప్రభుత్వం చెన్నై సహా ఐదు జిల్లాల్లో లాక్డౌన్ను కొనసాగిస్తోంది.
పుణె: మహారాష్ట్రలోని పుణె నగరం ముందు నుంచి కరోనాకు హాట్స్పాట్గా ఉంది. కేంద్రం విధించిన లాక్డౌన్కు ముందే అక్కడ కేసులు ఉధృత రూపాన్ని చూపించాయి. ఇప్పటి వరకు 30 వేల దాకా కేసులు నమోదవ్వడంతో.. పుణె ప్రభుత్వ యంత్రాంగం సోమవారం నుంచి లాక్డౌన్, 144 సెక్షన్ను అమలు చేస్తోంది ఇది ఈ నెల 23 వరకు కొనసాగుతుంది.
కేరళ: కేరళలో వైరస్ అదుపులోనే ఉన్నా.. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నెల 6 నుంచి తిరువనంతపురంలో మూడంచెల లాక్డౌన్ అమలవుతోంది. నగరానికి ఒకే ప్రవేశం/నిష్క్రమణ ఉంటాయి. ఇది మొదటి అంచె. రెండో అంచెలో.. కట్టడి ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిరోధిస్తారు. మూడో అంచెలో.. కొవిడ్-19 పాజిటివ్ వచ్చిన వారి ఇళ్లలోంచి ఎవరూ బయటకు రాకుండా కట్టడి చేస్తారు. తొలుత 7 రోజులకే లాక్డౌన్ విధించినా.. అది సోమవారంతో ముగియాల్సి ఉన్నా.. 23వ తేదీ వరకు పొడిగించారు. ఇక్కడ నమోదైన కేసుల సంఖ్య 808 మాత్రమే.
ఏపీ: ఏపీలో ఎక్కడా సంపూర్ణ లాక్డౌన్ అమలు కావడం లేదు. అయితే, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడి ప్రాంతాలుసహా రద్దీ ప్రాంతాల్లో లాక్డౌన్ సడలింపు వేళలను కుదించారు. నిత్యావసర, ఇతర దుకాణాల సమయాన్ని ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా తగ్గించి, జనసంచారంపై నియంత్రణ విధిస్తున్నారు. చాలా జిల్లాల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకే దుకాణాలకు అనుమతినిస్తున్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో వారం రోజుల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 15,2020 10:54AM